ఏఐజీ హాస్పటల్ లో తమ్మినేనిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి…!

ఏఐజీ హాస్పటల్ లో తమ్మినేనిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి…!
  • తమ్మినేని యోగక్షేమాలు తెలుసుకొన్న సీఎం
  • అస్వస్థత నుంచి కోలుకున్న తమ్మినేని
  • త్వరగా జనజీవనంలోకి రావాలన్న సీఎం

ఇటీవల అస్వస్థతకు గురై హైద్రాబాద్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రంను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ . రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం పరామర్శించారు …తమ్మినేని హాస్పటల్ లో చేరినప్పుడు దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంట బెట్టుకుని ఏఐజీ కు వెళ్లి తమ్మినేని యోగక్షేమాలు తెలుసుకున్నారు.

సకాలంలో సరైన వైద్య సేవలు అందించి త్వరగా కోలుకునేలా చేసిన ఏఐజీ హాస్పటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వరరెడ్డికి డాక్టర్ల బృందానికి , సిబ్బందికి అభినందనలు తెలిపారు …కాసేపు తమ్మినేనితో ముచ్చటించారు ..సీఎంకు హాస్పటల్ వద్ద సిపిఎం రాష్ట్ర నాయకులు , పోతినేని సుదర్శన్ , ఎస్ .వీరయ్య, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి , తమ్మినేని కుమారుడు మిత్రా, తదితరులు ఆహ్వానం పలికారు …సీఎం ,పొంగులేటిలకు ఏఐజీ సి అండ్ ఎండి నాగేశ్వరరెడ్డి, తమ్మినేనికి వైద్యం అందించిన తీరును వివరించారు ..