ఎసిబి కి చిక్కిన కోర్టు కానిస్టేబుల్
ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో కోర్టు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాంబాబు అనే కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ కి చిక్కాడు. ఒక కేసు విషయం లో జంపన్న అనే వ్యక్తి కి అనుకూలంగా తీర్పు వచ్చేలా చూస్తానని చెప్పి అతని దగ్గర రూ 15000 డిమాండ్ చేశారు. ఈ ఈ విషయమై బాధితుడు 20 రోజుల క్రితం ఏసిబి డిఎస్పీ ని ఆశ్రయించాడు. డిఎస్పి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిఘా పెట్టిన ఏసీబీ బృందం కొత్తగూడెం బస్టాండ్ లో లంచం తీసుకుంటున్న రాంబాబు ను అదుపు లో కి తీసుకున్నారు.