కరెంటు తీగలు తగిలి  డీసీఎం దగ్ధం

ఆత్మకూరు (ఎం), (ముద్ర న్యూస్): ఆత్మకూరు ఎం మండలం మొరిపిరాల గ్రామం మధిర పొలిమ రాజుల బావి వద్ద శనివారం రాత్రి విద్యుత్ తీగలకు డిసీఎం వాహనంలో గడ్డిని తరలిస్తుండగా ప్రమాదానికి గురై డీసీఎం వాహనం గడ్డి పూర్తిగా దగ్ధమైపోయాయి. శనివారం రేగులకుంట నుండి పగిడిపల్లి రైతు తోటకూరి ఐలయ్య డీసీఎం లో గడ్డి కట్టలు తీసుకెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  విద్యుత్ తీగలు గడ్డి కట్టలకు తలిగి భారీ గా మంటలు వ్యాపించాయి.

సుమారు నాలుగున్నర లక్షల ఆస్తి నష్టం జరిగింది. విద్యుత్ తీగల కింద ఇటీవల నూతనంగా రోడ్డు నిర్మించడంతో రోడ్డు ఎత్తు పెరిగింది. దీనిని గమనించకపోవడం వలన ఈ ప్రమాదం జరిగినట్టు స్థానిక రైతులు తెలిపారు. వెంటనే విద్యుత్ అధికారులు వైర్లని పైకి లేపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.