అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: అన్ని వర్గాల అభివృద్ధియే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింల సంక్షేమం కోసం వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో మసీదులు, ఈద్గాలు, దర్గా ల్ కోసం కోట్లాది రూపాయలు కేటాయించిన ట్లు తెలిపారు. తెలంగాణ లో గంగ జమున తహజీబ్ ఉంటుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఆర్డీవో గౌడ్, నాయకులు ఎజాస్, అంజిరెడ్డి, పాత బాలకృష్ణ,అధికారులు నాయకులు ముస్లీం సోదరులు పాల్గొన్నారు.