ఎం.బి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుల కుటుంబానికి బియ్యం అందజేత..

ఎం.బి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుల కుటుంబానికి బియ్యం అందజేత..

రాజపేట (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని వసంతపురం గ్రామానికి చెందిన వడ్లకొండ సత్తయ్య. మెండు భాస్కర్ లు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించిన విషయం తెలుసుకున్న ఎం బి ఆర్ ఫౌండేషన్ సభ్యులు ఆదివారం నాడు వారి నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. అనంతరం బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మెండు సాయికుమార్ రెడ్డి. ములకలపల్లి సాయి. తప్పట్ల అనిల్ కుమార్. మెండ మెండు భగవాన్ రెడ్డి. మెండు సాయికుమార్ రెడ్డి. కాసోజి బ్రహ్మచారి. గుల్లపల్లి వెంకటేష్. వడ్లకొండ శివ. చింతలపల్లి సాయి కిషోర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.