అనురాగం,అనుబంధాలకు ప్రతీక రక్షాబంధన్ - జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

అనురాగం,అనుబంధాలకు ప్రతీక రక్షాబంధన్ - జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: మానవీయ సంబంధాలను పటిష్టం చేస్తూ ప్రేమానురాగాలను పంచడమే రక్షా బంధన్ ఉద్ధేశమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అన్నారు. రక్షాబంధన్ పురస్కరించుకుని బుధవారం నాగర్ కర్నూల్ శిశుమందిర్ పాఠశాల విద్యార్థులు సమీకృత కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ తో పాటు ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగులందరికీ రాఖీకట్టి ప్రేమను పంచుకున్నారు.

అనురాగం..ఆప్యాత..అనుబంధాలను పంచేదే రాఖీ పండుగ అని కలెక్టర్ అభివర్ణించారు. సోదర,సోదరి ల అనుబంధానికి గుర్తు గా మాత్రమే కాకుండా ఆత్మీయుల మధ్య కూడా ఐకమత్యానికి పరస్పర చిహ్నంగా రాఖీ పౌర్ణమి పండుగ చేసుకుంటారని కలెక్టర్ అన్నారు.విద్యార్థులు నైతిక విలువలతో విద్యలో రాణించి భావి భారత పౌరులుగా ఎదగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు.పవిత్రమైన సోదరిబావాన్ని బలోపేతం చేసే పండగే రాఖీ అని,దేశ సంస్కృతి సాంప్రదాయాలలో ఇది గొప్ప ఆచారమని,ప్రజల మధ్య సోదరభావం మరింతగా విరిసిల్లాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.శిశు మందిర్ విద్యార్థులు టీచర్లు పాల్గొన్నారు.