తుంగతుర్తి అభివృద్ధి పై బిజెపి నాయకుల అసత్య ప్రచారాలను ఖండిస్తున్నాం

తుంగతుర్తి అభివృద్ధి పై బిజెపి నాయకుల అసత్య ప్రచారాలను ఖండిస్తున్నాం
  • బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య
  • డిసిసిబి డైరెక్టర్  తుంగతుర్తి సింగిల్ విండో  చైర్మన్ గుడిపాటి సైదులు..

తుంగతుర్తి ముద్ర:-రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ  పథకాలను ప్రజలకు అందిస్తూ నిరంతరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే డాక్టర్ జాదరి కిషోర్ కుమార్ పై బిజెపి నాయకుల స్వచ్ఛ ప్రచారాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని  మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డిసిఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదులు అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.తుంగతుర్తి నియోజకవర్గంలో రోజురోజుకు పెరుగుతున్న ఎమ్మెల్యే బలాన్ని పలుకుబడిని చూసిజీర్ణించుకోలేక అవాకులు చవాకులు తేలుతున్నారని అన్నారు.బిజెపి నాయకులు చేసే అసత్య ఆరోపణలకు   ఎమ్మెల్యేకు గాని బీఆర్ఎస్ పార్టీకి గాని ఎలాంటి సంబంధం లేదని, అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని  చూసే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామనీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కు హ్యాట్రిక్ విజయాన్ని అందించడమే కాకుండా ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. అదేవిధంగా ఇటీవల సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10లక్షల రూపాయలు అభివృద్ధి నిధులు ఇస్తామని ప్రకటించడంతోపాటు తుంగతుర్తి నియోజకవర్గానికి మూడవసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గాదరి కిషోర్ కుమార్ ను ప్రకటించినందున ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలియజేస్తూ శుక్రవారం ఉదయం 9 గంటలకు తుంగతుర్తి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించనునట్లు తెలిపారు. ఇట్టి ర్యాలీకి మండల పరిధిలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ దొంగరి శ్రీనివాస్, గ్రంధాలయ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పులుసు వెంకటనారాయణ గౌడ్, తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.