జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల జిల్లా ఎన్నికలు....

జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల జిల్లా ఎన్నికలు....

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :  జిల్లా కేంద్రంలోని మత్స్యకారుల ఎన్నికల నగారా ఈరోజు ఉదయం 11.30 గంటల సమయానికి ఎలక్షన్ అధికారి నోటిఫికేషన్  జిల్లా కోపరేట్ ఎన్నికల జిల్లా అధికారి ఆడిట్ ఆఫీసర్ రఘునందన్ రావు గారు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది... నాగర్ కర్నూల్ పట్టణంలోని నల్లవెల్లి రోడ్డు లో గల మన పాత సొసైటీ ఆఫీస్ బిల్డింగ్ లో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల  అధ్యక్షుల అందరికీ ఎన్నికల అధికారి మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్నికల విధివిధానాలు , నియమ నిబంధనలు తెలియజేసిన ఎన్నికల అధికారి నోటిఫికేషన్ పత్రాలను మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల నాయకులకు అందజేయడం జరిగింది... నాగర్ కర్నూల్ జిల్లాలో గల 223 అన్ని గ్రామాల మత్స్య సహకార సంఘాల సొసైటీ అధ్యక్షులకు గాను గత రెండు నెలల క్రితం జిల్లా సొసైటీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.తిరిగి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది,

నాగర్ కర్నూల్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, డైరెక్టర్ లు అన్ని కలిపి 11 డైరెక్టర్ లు కలవు.... మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల జిల్లా కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ 27వ తేదీ అభ్యర్థులు నామినేషన్ సమయం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నామినేషన్ దాఖలు చేయడం మరియు మధ్యాహ్నం 2 గంటల నుంచి నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు నామినేషన్ ఉపసంహరణ నిర్వహించటం జరుగుతుంది అని తెలిపారు.అదేవిధంగా డిసెంబర్ 31వ తేదీన ఉదయం నుంచి ఎన్నికలు నిర్వహిస్తామని.... సాయంత్రం ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా చీఫ్ ప్రమోటర్ వాకిటి ఆంజనేయులు, ప్రమోటర్ తుమ్మల అల్లోజీ, ప్రమోటర్ గొడుగు సహదేవుడు, పెబ్బేటి నిరంజన్, పర్వతాలు, సత్యం,ఈశ్వర్, మత్స్య సహకార సంఘాల జిల్లా యువ నాయకుడు హరికృష్ణ ముదిరాజ్, చాపల స్వామి, మల్లేష్,తవిటి నిరంజన్,తిరుపతయ్య, సైదులు, శోభన్, రాములు, వెంకటయ్య, బంగారయ్య, శ్రీనివాసులు, అశోక్ , చిట్టి బాబు, శివ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.