కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు బంగారు భవిత

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు బంగారు భవిత

వరంగల్ : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి యువత నడుం కట్టాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకుడు భూపాల్ నాయక్ పిలుపునిచ్చారు. శనివారంనాడు మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో కాంగ్రెస్ పార్టీ పోలింగ్ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు బంగారు భవిష్యత్తు ఉండగలదని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారెంటీల గురించి కార్యకర్తలు గడపగడపకు వెళ్లి ప్రచారం చేయాలని ఆయన సూచించారు.