ఘనంగా గణనాథుని నిమజ్జనం

ఘనంగా గణనాథుని నిమజ్జనం

ముద్ర ప్రతినిధి భువనగిరి: భువనగిరి మండలంలోని మన్నె వారి పంపు గ్రామంలో పవనపుత్ర యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణనాధుడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామ సమీపంలోని మదీనా చెరువులో శనివారం ఉదయం నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోయిని పాండు, నాయకులు సామల సత్తిరెడ్డి, ఉడుత లక్ష్మణ్, కమిటీ సభ్యులు బోయిని మధు, మణికంఠ, భరత్ కుమార్, మెడబోయిన మధు పాల్గొన్నారు.