వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా దోరేపల్లి శ్వేత

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా దోరేపల్లి శ్వేత

ఖమ్మం, ముద్ర ప్రతినిధి: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా 58వ డివిజన్ మున్సిపల్ కార్పొరేటర్ దోరేపల్లి శ్వేత ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.  18 మందితో పాలకవర్గం ఏర్పాటు చేశారు.  వైస్ చైర్మన్ గా షేక్ అఫ్టల్, మార్కెట్ కమిటీ సభ్యులుగా గుండా ముత్తయ్య, జాటోతు సుందర్ సూర్య, మందా రామకృష్ణ, పొట్లపల్లి నాగరాజు, యాస రామారావు, నున్నా శ్రీనివాసరావు, మందడపు మాధవరావు, కుతుంబాక నరేష్, తాత వెంకటేశ్వర్లు, వంకాయలపాటి వెంకటలచ్చయ్య, పత్తిపాక రమేశ్, దేవత అనిల్ కుమార్, ఖమ్మం అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్, టేకులపల్లి పీఏసీఎస్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, ఖమ్మం మేయర్ సభ్యులుగా ఉంటారు.