28న ఖమ్మం లకారంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ

28న ఖమ్మం లకారంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ

జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి ఏర్పాట్లు పై చర్చించిన మంత్రి అజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: జిల్లా కేంద్రంలోని ఖమ్మం లకారం ట్యాంక్ బండ్‌పై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఎన్.టీ. రామారావు శత జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి మే 28న తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరణ చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరబాద్ లో మంగళవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన నివాసంలో కలిసి విగ్రహావిష్కరణ ప్రారంభానికి సంబంధించి ఏర్పాట్ల పై చర్చించారు.ఈ నేపథ్యంలో మే 28న శ్రీకృష్ణుని అవతారంలో ఎన్టీఆర్‌ పర్యాటకులను ఆకర్షించనున్నారు.