మంథనిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు 

మంథనిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు 

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:  మంథని పట్టణానికి చెందిన  ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరు తాటి నాగరాజు గౌడ్, తాటి నవీన్ గౌడ్ లు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఇటీవల  మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను బుధవారం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు శ్రీనుబాబు పరామర్శించారు. మృతుల చిత్రపటానికి పూలమాల వేసి  నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అన్నదమ్ములు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం మృతి చెందిన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని శీను బాబు ఆవేదన వ్యక్తం చేశారు వారి కుటుంబాలకు మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుందని భరోసా కల్పించారు. అలాగే  శ్రీరాంనగర్ లో సుంకవెల్లి వెంకట సుబ్బారావు మృతిచెందగా వారి కుటుంబాన్ని శ్రీనుబాబు పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ కొండ శంకర్,  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, నాయకులు సురేందర్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్,  ప్రముఖ న్యాయవాది సహేందర్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.