కవిత ఇంట్లో ఈడీ సోదాలు

కవిత ఇంట్లో ఈడీ సోదాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ జాయింట్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో 10 మంది అధికారుల బృందం తనిఖీలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు ఆమె ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.