బిల్డింగ్ పై నుంచి దూకి వృద్ధురాలి ఆత్మహత్య…

బిల్డింగ్ పై నుంచి దూకి వృద్ధురాలి ఆత్మహత్య…

ముద్ర,హైదరాబాద్:- మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఉప్పల్ మండలం నాగోల్ పరిధిలో అపార్ట్‌మెంట్ పైనుంచి వృద్ధురాలు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇందు అరణ్య అపార్ట్‌మెంట్ రెండో అంతస్తు నుంచి నాగమణి అనే మహిళ(74) దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో వారి వేధింపులతో ఆత్మహత్య చేసుకుందా? లేక అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.