ప్రజల సమస్యలను ప్రధాన వార్తలు గా...గ్రేట్..కూన శ్రీశైలం గౌడ్

ప్రజల సమస్యలను ప్రధాన వార్తలు గా...గ్రేట్..కూన శ్రీశైలం గౌడ్

'ముద్ర' పత్రికను అభినందించిన కూన శ్రీశైలం గౌడ్
 'ముద్ర' తొందరలో ప్రజలు మెచ్చే స్థాయికి చేరుకుంటుంది.

ప్రజల ఎదుర్కొనే సమస్యలను  అన్యాయాలను ప్రధాన  శీర్షికలుగా ప్రచురించే  పత్రికలు భవిష్యత్  లో ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటాయని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. బుధవారం తన కార్యలంలో ముద్ర పత్రిక ను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన ముద్రతో మాట్లాడుతూ  పేద ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ప్రధాన ప్రాతినిధ్యం కల్పించే ముద్ర దినపత్రిక కు మంచి భవిష్యత్తు ఉందన్నారు. సమాజంలో జరిగే అన్యాయాలను ఎండగడుతూ  ప్రశ్నించే  పత్రికకు ఎప్పుడు అండగా ఉంటామన్నారు. సీనియర్ జర్నలిస్టుల సారథ్యంలో వెలువడుతున్న 'ముద్ర 'మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన అన్నారు.