పేదరికం నుండి ఎస్సై పోస్ట్ ఎంపిక

పేదరికం నుండి ఎస్సై పోస్ట్ ఎంపిక

గుండాల ఆగస్టు 08 (ముద్ర న్యూస్): కష్టపడితే గాని జీవనం గడిచే కుటుంబంలో పేదరికం అడ్డు రాకూడదని లక్ష్యంతో వారి చదువులకు తల్లిదండ్రులు రాచ మార్గాన్ని పరిచారు,తల్లిదండ్రుల ఆశయాల నీడలో కొనసాగుతూ ముందుకు సాగిన బొంత ప్రవీణ్ ఆదివారం వెలువడిన ఎస్సై పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు ఇటు తల్లిదండ్రుల ఆశయాలకు పెరిగిన ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టారు మొదటి నుండి చదువులో ప్రతిభకు పట్టం కడుతూ గ్రామంలోనే ఉండి కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఎస్సై పోస్ట్ ని సాధించాడు.ఈ సందర్భంగా,స్థానిక ప్రజా పతినిధులు గ్రామస్తులు అభినందించారు.