ఆపరేషన్‌ అజయ్‌..

ఆపరేషన్‌ అజయ్‌..
  • ఇజ్రాయిల్‌ నుంచి భారతీయులను తరలింపు 

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇజ్రాయెల్ – -హమాస్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది.  పరిస్థితి విషమించడంతో ఇజ్రాయెల్ నుంచి భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు ‘ఆపరేషన్ అజయ్‌’ను ప్రారంభిస్తున్నట్లు విదేశాంగ మంత్రి డాక్టర్​ జైశంకర్ తెలిపారు. పౌరులను తిరిగి తీసుకురావడానికి చార్టర్డ్ విమానాల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఆపరేషన్ అజయ్‌ ద్వారా గురువారం ఇజ్రాయిల్‌ నుంచి భారతీయుల తరలింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. బాధితులు చేరుకున్న తరువాత వారి వారి ఇళ్లకు చేరుకునే విధంగా ప్లాన్ వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తరలించేందుకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా భద్రత ఏర్పాట్లు పూర్తి చేశారు.