ధర్మపురి అరవింద్ గెలుపుకై అందరు క్రుషి చేయాలి

ధర్మపురి అరవింద్ గెలుపుకై అందరు క్రుషి చేయాలి

 ముద్ర, కోరుట్ల: కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో శక్తి వందన్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి పాల్గోని నరేంద్ర మోడీ అభివృద్ధి మరియు పథకాల గురించి స్థానిక మహిళలకు వివరించారు. అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కమలం పువ్వు గుర్తు పై ఓటేయాలని ధర్మపురి అరవింద్ నీ బారి మెజారిటీతో గెలిపించాలనీ కోరారు.

ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల అధ్యక్షులు పంచిరి విజయకుమార్, యూసుఫ్ నగర్ సర్పంచ్ గుగ్గిళ్ళ తుకారం గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు అంబల్ల సుదర్శన్, బీజేవైఎం మండల అధ్యక్షులు వెంకటరెడ్డి రాజు, జిల్లా కిసాన్ మోర్చ కార్యదర్శి మల్లారెడ్డి, కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షుడు ఏలేటి రాజు, బూత్ అధ్యక్షులు నాగరాజు, అన్నెల సురేష్, పి ఎ సి ఎస్ సి డైరెక్టర్ ఏలేటి లింగారెడ్డి, మరియు మహిళలు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.