బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
  • రెండు లక్షల ప్రమాద బీమా చెక్కుల పంపిణిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్,  మాజీ స్పీకర్ మధు చారి


ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ప్రమాదవశాత్తు మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు రెండు లక్షల ప్రమాద బీమా చెక్కుల పంపిణిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్,  మాజీ స్పీకర్ మధు చారి అన్నారు. శుక్రవారం మంథని పట్టణంలోని ఎస్ ఎల్బీ గార్డెన్ లో బీఆర్ ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం లో ఇటీవల ప్రమాదం లో మరణించిన కార్యకర్తల కుటుంబాలకూ రెండు లక్షల ప్రమాద బీమా చెక్కులను మాజీ స్పీకర్ మధు చారి,  బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోర్కంటి చందర్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు చేతుల మీదుగా బాధితులకు అందజేశారు.

మంథని నియోజక వర్గంలోని మహముత్తారం మండలం మాదారం గ్రామానికి చెందిన గంప రాజు మరణించగ ఆయన భార్య కవిత కు, మంథని పట్టణానికి చెందిన ఎడ్ల శంకర్ భార్య పద్మ కు, మహదేవపూర్ మండలం బొమ్మపూర్ గ్రామానికి చెందిన పీక మల్లయ్య మరణించగ ఆయన భార్య పోచమ్మ కు,మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన బాల్నే రాజయ్య మరణించగ ఆయన భార్య మల్లికదేవి కి,మంథని మండలం సూరయ్యపల్లె గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్ మరణించగ ఆయన భార్య నాగలక్ష్మి కి కమాన్ పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన పిడుగు సంపత్ మరణించగ ఆయన కుమారుడు అజయ్  కుటుంబాలకు భారత ప్రమాద బీమా ఒక్కొక్కరికి రూ. 2,00,000 లక్షల రూపాయల చెక్కుల ను వారు పంపిణీ చేశారు.