సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ బాబుకు మాజీ జడ్పీటీసీ నాగినేని శుభాకాంక్షలు
ముద్ర ముత్తారం: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ విహారాల శాఖ మంత్రిగా హైదరాబాదులోని సచివాలయంలో గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తారం మాజీ జడ్పిటిసి లు నాగినేని జగన్మోహన్ రావు, చొప్పరి సదానందం, ముత్తారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ, కాటారం సీనియర్ నాయకుడు బండ వసంత రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ను సచివాలయంలోని ఛాంబర్ లో కలిసి మంత్రి కి శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట నాయకులు బక్కతట్ల కుమార్, తదితరులు ఉన్నారు.