పేద ప్రజలకు అండగా ఈటల రాజేందర్
![పేద ప్రజలకు అండగా ఈటల రాజేందర్](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64b7ad226bee6.jpg)
ముద్ర, జమ్మికుంట :-హుజురాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గం లో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నాడు అని తెలిసి జమ్మికుంట మండలం లోని వెంకటేశ్వర్లపల్లె గ్రామానికి చెందిన నిరుపేదలు వారి ఆరోగ్య సమస్యలను ఈటల రాజేందర్ దృష్టికి తీసుకు వెళ్లడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వెంకటేశ్వర్లపల్లె గ్రామానికి బస్సును పంపించి ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 40 మంది పేదవారిని ఉచితంగా వైద్యం చేపించడం కోసం హైదరాబాద్ లో (వొంటిమామిడి) ఆర్ వి యమ్ హాస్పిటల్ కు తీసుకెళ్లాడని, ఇలాంటి వ్యక్తి మా ఎమ్మెల్యే కావడం అదృష్టంగా భావిస్తున్నామని గ్రామ ప్రజలు అన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఈటల రాజేందర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. BJP నాయకులు దొగ్గల భాస్కర్,పుల్లూరి ఈశ్వర్ , మచ్చ శ్రీనివాస్,పుల్లూరి సంపత్,సుంకిషాల తిరుపతి, మహేందర్ , కుమార్ ,కొమురయ్య. మురలి ,శ్రీను, తదితరులు పాల్గొన్నారు.