రైతు సంక్షమమే బీజేపీ లక్ష్యం

రైతు సంక్షమమే బీజేపీ లక్ష్యం

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతనిధి రాణి రుద్రమ

ముద్ర ప్రతినిధి, జనగామ : రైతు సంక్షేమమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ అన్నారు. జనగామ జిల్లాలోని విజయ ఫంక్షన్ హాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ శర్మ ఉపాద్యాయ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించాయి. అనంతరం జరిగిన సమావేశంలో రాణిరుద్రమ తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఇస్తుందన్నారు. 

9 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం పునర్వవ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి అందించిన ప్రత్యేక సాయం, నిధులు, ఏ రంగానికి ఎంత కేటాయించారని గణాంకాలతో సహా వివరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు విద్యాసాగర్ రెడ్డి, ఉడుగుల రమేష్, సౌడ రమేష్, శివరాజ్ యాదవ్, బేజాడి బీరప్ప, మహేందర్, కౌన్సిలర్స్ హరిచంద్ర గుప్తా, శ్రీలత, మైపాల్, కొంతం శ్రీనివాస్, గుజ్జుల నారాయణ, పవన్ శర్మ, శ్రీనివాస్ రెడ్డి, రాజు నాయక్, మాలతి, జగదీష్, శ్రీనివాస్, హరిప్రసాద్, బాలాజీ పాల్గొన్నారు.