గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

ముద్ర, రఘునాథపల్లి :  గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఖిలాషాపురం గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకుడు  నక్క రాంచందర్‌‌కు బుధవారం అర్ధరాత్రి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన మండలంలోని మంగల్ బండ తండాలో పని చేస్తున్నారు. అంతకుముందు మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్లో కూడా పని చేశారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు శాగ కైలాసం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత రమేశ్‌ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.