ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

ముద్ర,రంగారెడ్డి:ఆర్థిక సమస్యలతో ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ తండ్రి. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో సోమవారం తెల్లవారుజామున తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం టంగుటూరు గ్రామానికి చెందిన రవి 1000 రూపాయలకు 3000 రూపాయలు ఇప్పిస్తానని పలువురు  గ్రామస్తుల వద్ద డబ్బు సేకరించి మనిస్కీమ్ లో పెట్టించాడు .

1000 కి 3,000 ల రూపాయలు, ఐదు లక్షల రూపాయలు 58 రోజులలో ఇప్పిస్తానని పెట్టించాడు.సమయం అయిపోయినా మనీ స్కీం    డబ్బులు తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు రవిని నిలదీశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రవి సోమవారం తెల్లవారుజామున తన ముగ్గురు పిల్లలను హత్య చేసి  గ్రామ శివారులో ఒక చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనతో టంగుటూరు గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. జరిగిన సంఘటనపై శంకర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.