పేదల ఆకలి తీర్చడానికే ఐదు రూపాయల భోజనం..

పేదల ఆకలి తీర్చడానికే ఐదు రూపాయల భోజనం..
  • ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.

మెట్‌పల్లి ముద్ర:- పేదల ఆకలి తీర్చడానికే ఐదు రూపాయల భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. మంగళవారం కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నపూర్ణ క్యాంటీన్ ఐదు రూపాయలకు భోజనం ను ఎమ్మెల్యే దంపతులు ప్రారంభించారు. పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు నా తనయుడు ఇస్కాన్ సహకారంతో అన్నపూర్ణ క్యాంటీన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ. కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలకు చుట్టూ ఉన్న గ్రామాలతో పాటు ఆయా ప్రాంతాల నుండి వ్యాపారాల నిమిత్తం వస్తుంటారని వాళ్లు భోజనం చేసేందుకు వందల రూపాయలు ఖర్చు చేయవలసి వస్తుందని, వీరితో పాటు అనేక మంది పేద ప్రజల కు ఐదు రూపాయల భోజనం కడుపు నింపుతుందనే ఉద్దేశంతో అన్నపూర్ణ క్యాంటీన్ ఉపయోగ పడుతుంది, ఈ క్యాంటీన్ ద్వారా రెండు పట్టణాలలో సుమారు 7 వందల మందికి భోజనం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లు రణవేణి సుజాత సత్యనారాయణ, అన్నం లావణ్య అనిల్, వైస్ చైర్మన్లు బోయినపల్లి చంద్రశేఖర రావు, పవన్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.