స్వర్ణనంది పురస్కారం అందుకున్న మాజీ ఎంపిటిసి మచ్చ మాలతి నరసింహ గౌడ్

స్వర్ణనంది పురస్కారం అందుకున్న మాజీ ఎంపిటిసి మచ్చ మాలతి నరసింహ గౌడ్

ముద్ర ప్రతినిధి భువనగిరి: ఉత్తమ సేవలందించిన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మచ్చ మాలతి నరసింహ గౌడ్ ఉగాది పురస్కారాలలో స్వర్ణ నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఆదర్శ కళానిలయం వ్యవస్థాపక అధ్యక్షుడు చేరాల ప్రకాష్ లలిత దంపతుల ఆధ్వర్యంలో హైదరాబాదులోని తెలంగాణ సారస్వత పరిషత్ భవనంలో గల డాక్టర్ దేవులపల్లి రామానుజారావు కళామందిరంలో ఆదివారం రాత్రి ఉగాది స్వర్ణనంది పురస్కారాలు ఘనంగా అందజేశారు.

ఈ కార్యక్రమానికి సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ, ప్రముఖ సినీ నటులు మా ఈసీ సభ్యులు మాణిక్, ప్రముఖ సినిమా టీవీ నటులు రాజేందర్, విజయ భాస్కర్, ఆంధ్రప్రదేశ్ అమరావతి అసెంబ్లీ ఓ ఎస్ డి డాక్టర్ ఎం ప్రభాకర్, సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సర్స్ వెంకటేష్, కళ్యాణి, శ్రీకాంత్, సంధ్య, శ్రీనివాస్, రమణమ్మ, డాక్టర్ భవాని భరద్వాజ్, కొత్త కనకరత్నమాల ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ మచ్చ మాలతి నరసింహ గౌడ్ దంపతులను శాలువాతో సన్మానించి స్వర్ణ నంది పురస్కారాన్ని అందజేసి ప్రశంసించారు.