ఎంపీ అభ్యర్థి మల్లేశం గెలుపునకు కృషి చేద్దాం

ఎంపీ అభ్యర్థి మల్లేశం గెలుపునకు కృషి చేద్దాం

బీబీనగర్ బీఆర్ఎస్ మండల సమావేశం

బీబీనగర్, ముద్ర ప్రతినిధి: భారత రాష్ట్ర సమితి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి క్యామ మల్లేశం గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బొక్క జైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.

పార్టీ బీబీనగర్ మండల కార్యాలయంలో సోమవారం సమావేశమై ప్రచార కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. కార్యకర్తలు అధైర్య పడకుండా పనిచేయాలని, భవిష్యత్ బీఆర్ఎస్ లోనే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఆకుల ప్రభాకర్, మాజీ సర్పంచ్ వేణుగోపాల్, మాజీ ఉపసర్పంచ్ శ్రీశైలం, గోలి సంతోష్ రెడ్డి, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.