కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ప్రచారం

కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ప్రచారం

వలిగొండ (ముద్ర న్యూస్) : భువనగిరి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా వలిగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించారు. వలిగొండ మండల కేంద్రంలో పట్టణ అధ్యక్షుడు కంకల కిష్టయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు గ్రామంలోని ప్రతి గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పబ్బు సురేందర్, బత్తిని సహదేవు, కొమరయ్య, బత్తిని సత్యనారాయణ, కాసుల వెంకన్న, దండ మల్లికార్జున్, బత్తిని సైదులు, పల్లెర్ల రాజు, విష్ణు,  కంకల శ్రీను, బత్తిని వెంకటేష్, సతీష్, శ్రీను, మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.