ప్రజలకు అందుబాటులో ఉండేందుకే ఆర్భాటాలకు తిరస్కారం: ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి

ప్రజలకు అందుబాటులో ఉండేందుకే ఆర్భాటాలకు తిరస్కారం: ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నియోజకవర్గ ప్రజల అహంకార నేతకు బుద్ధి చెప్పి తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని ప్రజలకు సేవకుడిగా పనిచేసేందుకు ఆర్భాటాలను అదనపు భద్రతను తిరస్కరిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పోలీస్ అధికారులకు తెలిపారు. తన పర్యటన సందర్భంగా ఎస్కార్ట్ వాహనంతో పాటు పోలీస్ అధికారుల వాహనాలు ఉండటం వల్ల సాధారణ ప్రజలు తనను కలిసేందుకు ఇబ్బందులు ఏర్పడతాయని ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి సాధించడం జరిగిందని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు త్వరలో క్యాంపు కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజలు తమ సమస్యలతో పాటు గ్రామ అభివృద్ధికి నేరుగా తనను సంప్రదించ వచ్చు అని తాను ఎమ్మెల్యేగా ఎన్నికైంది ప్రజలకు సేవ చేసేందుకే కానీ కాంట్రాక్టర్ల కోసం అవినీతి అక్రమాలకు కాదని తెలిపారు. సాధారణ వ్యక్తిగా ఎమ్మెల్యే వ్యవహరించడం పట్ల ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు