గౌడ సంఘాల మద్దతు బి ఆర్ ఎస్  కే

గౌడ సంఘాల మద్దతు బి ఆర్ ఎస్  కే
  • తెలంగాణ గౌడ సంఘం జనగామ జిల్లా అధ్యక్షులు గడ్డం రాజు

ముద్ర,జఫర్‌గడ్:స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఉన్న గౌడ సంఘం కులస్తులు బిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు గడ్డం రాజు అన్నారు. గురువారం జనగామ జిల్లా జఫర్‌గడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ సంఘం నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గడ్డం రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కులవృత్తులు కనుమరుగై అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కెసిఆర్ కులవృత్తులకు ప్రోత్సహిస్తూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో గౌడ కులస్తులకు కమ్యూనిటీ హాల్ లు తోపాటు ఎల్లమ్మ తల్లి నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించిన నాయకులు కడియం శ్రీహరి అన్నారు. అంతేకాకుండా కడియం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థుల ఉన్నత విద్యగా ఆర్థిక సాయం అందించడంతోపాటు, గౌడ కులస్తుల సమస్యలను పరిష్కరించిన గొప్ప నాయకుడు అన్నారు . స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో  36వేల గౌడ కులస్తులు ఉన్నారన్నారు. గౌడ కులస్తుల పూర్తి మద్దతు టిఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరికి ఉంటుందని కడియం శ్రీహరిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామన్నారు. సమావేశంలో మండల గౌడ సంఘం అధ్యక్షులు గడ్డం రవీందర్, జిల్లా నాయకులు గట్టు రమేష్, మనోహర్ గౌడ్, టి సుభాష్, రమేష్, బైరి నాగరాజుగౌడ్, పట్టపూరి కృష్ణ, బురిగే కొమురయ్య, తాళ్లపల్లి సోమయ్య తోపాటు గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు