పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కేనా...?

పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కేనా...?
  • ఎంపీ బోర్లకుంట వెంకటేష్ బోర్ల పడ్డట్టేనా

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి వారసుడు గడ్డం వంశీకే ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా పెద్దపల్లి నుంచి అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఆ పార్టీలోని సీనియర్ నాయకులతోపాటు ప్రస్తుత పెద్దపెల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ ఇటీవలనే బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటినుంచి ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన యువ నాయకుడు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీకి టిక్కెటు దాదాపు ఖరారు అయినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నాడు పార్టీ అధిష్టానం అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని తెలియడంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఎంపీ అభ్యర్థి ఎవరు అనే ఉత్కంఠకు తెరబడనున్నది.