గోదావరిఖని ఏసీపీగా మడత రమేష్ నియామకం
ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: రామగుండం కమీషనరేట్ పరిధిలోని గోదావరిఖని సబ్ డివిజన్ ఏసీపీ గా పనిచేస్తున్న తుల శ్రీనివాసరావు బదిలీ అయ్యారు.ఆయనను డీజీపీ కార్యాలయం లో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.ఆయన స్థానం లో డీజీపీ కార్యాలయం లో వెయిటింగ్ లో ఉన్న మడత రమేష్ ను నియమించారు.