ముత్తారం ఎంపీడీగఓ గా బాధ్యతలు స్వీకరించిన జి. లలిత
ముద్ర ముత్తారం: ముత్తారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపిడిఓ గా) జి. లలిత బుధవారం ఉదయం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎంపీడీవో గా విధులు నిర్వహించిన కలికోట శ్రీనివాస్ సిరిసిల్ల జిల్లాకు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో లలిత జిల్లాలోని పాలకుర్తి మండలం నుంచి బదిలీ పై వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో లలిత కు ఎంపీ ఓ వేణుమాధవ్, సూపరిండెంట్, ఎంపీఓ, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.