ధర్మారం గ్రామ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలి...
- మంత్రి శ్రీధర్ బాబుకు వినతి పత్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పూదరి సర్వేష్ గౌడ్
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: మంథని మండలంలోని దర్మారం (గద్దల పల్లి) గ్రామానికి అధిక నిధులు కేటాయించి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ఐటి, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును శనివారం హైదరాబాదులో కలిసి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గ్రామానికి చెందిన పూదరి సర్వేష్ గౌడ్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్వేష్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామం ధర్మారం గ్రామాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారని, గతంలో శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్న సమయంలో అధిక నిధులు కేటాయించి గ్రామంలో సిసి రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణం చేపట్టామని, ఇప్పుడు కూడా మంత్రి ఆశీర్వాదాలతో గ్రామ అభివృద్ధికి అధిక నిధులు తీసుకువచ్చి గ్రామాలలో అభివృద్ధి పనులు చేపడుతామని సర్వేష్ గౌడ్ తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రికి సర్వేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.