గ్రామాల అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వ ధ్యేయం

గ్రామాల అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వ ధ్యేయం
పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: ఈ రోజు గద్వాల నియోజకవర్గం గట్టు మండలం పరిధిలోని అంతంపల్లి గ్రామంలో పలు అభివృద్ధి  భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. హాజరయ్యారు. అంతంపల్లి గ్రామంలో శివాలయం దేవాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగినది. అదేవిధంగా గ్రామంలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ (ఫంక్షన్ హాల్), 15 లక్షల వ్యయంతో సి సి రోడ్డు  నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యే కి గ్రామ సర్పంచ్ శాలువా కప్పి పూలమాలతో  ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటు తర్వాతనే  సీఎం కేసీఆర్. నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామాలపై కేసీఆర్. ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక టాక్టర్, ట్యాంకర్, అదేవిధంగా గ్రామము ప్రజలందరూ అరణ్యంగా ఉండాలని ఎప్పుడూ పరిశుభ్రంగా గ్రామాల నుంచి పోవడానికి మల్టీపర్పస్ వర్కర్స్, డంపింగ్ యార్డ్ లో, గ్రామంలో ప్రజలు కాసేపు సాయంకాలం  సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడానికి పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరిగింది.

వైకుంఠధామాలు అదేవిధంగా గ్రామాలలో సిసి రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు గ్రామపంచాయతీ భవనలు ఏర్పాటు చేయడం గ్రామాలలో పట్టణాల తీర్చిదిద్దడం జరుగుతుందని కేసీఆర్. నాయకత్వంలో సాధ్యమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గద్వాల నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో పేద ప్రజలు వివాహ శుభకార్యాలు జరుపుకోవాలని మల్టీపర్పస్ కమిటీ హాల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని. ఫంక్షన్ హాల్ లో త్వరలో  అన్ని గ్రామాలలో  అన్ని సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులో రావడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు వేషగాళ్లు రకరకాల వేషాలు వేసుకొని ప్రశాంతంగా గ్రామాలలో అలజడి సృష్టించడానికి   ఇబ్బందులను పెట్టడానికి  రావడం జరుగుతుంది. కాబట్టి  వాటిని తిప్పికొట్టే విధంగా కేసీఆర్. నాయకత్వంలోనే మేమంతా సంతోషంగా ఉన్నామని కెసిఆర్. మా నాయకుడని వారికి సమాధానం చెప్పాలి సూచించారు. మరొక్కసారి మన ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని  బంగారు తెలంగాణ నిర్మాణం కేసీఆర్ తో సాధ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, ఎంపీపీ విజయ్, మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, సర్పంచులు,  షేడ్రీక్, చిన్న గోవిందు, చెన్న రాయుడు, సూర్య గౌడ్, బుడ్డన్న,  బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు,  తదితరులు పాల్గొన్నారు