14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపు

14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (MSP)ని ఆమోదించింది, వరి, రాగులు, బజ్రా, జొన్న, మొక్కజొన్న, పత్తి సహా 14 ఖరీఫ్ సీజన్ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ని కేంద్ర మంత్రివర్గం బుధవారం (జూన్ 19) ప్రకటించింది. దీని వల్ల ప్రభుత్వంపై రెండు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్రభావం ఉంటుంది. గత ఏడాది కంటే రైతులకు రూ.35,000 కోట్ల లాభం. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలపై, కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, "వరి, రాగి, బజ్రా, జొన్న, మొక్కజొన్న మరియు పత్తితో సహా 14 ఖరీఫ్ సీజన్ పంటలపై కనీస మద్దతు ధర (MSP)కి కేబినెట్ ఆమోదం తెలిపింది." అని వెల్లడించారు.