అసెంబ్లీలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఛాంబర్ ప్రారంభం..
- ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్
ముద్ర ప్రతినిధి భువనగిరి : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఛాంబర్ ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరై బీర్లు ఐలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఛాంబర్ లో యాదాద్రి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేసి లడ్డు ప్రసాదం ఇచ్చారు. ఈ ఛాంబర్ ప్రారంభోత్సవానికి ఆలేరు నియోజకవర్గం నుండి జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.