ఘనంగా మహేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు 

ఘనంగా మహేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు 
  • బి జే వై ఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం నిర్మల్ లో బీజేపీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని  ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ  సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మహేశ్వర్ రెడ్డి  క్యాంప్ కార్యాలయంలో బి జె వై ఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.