పదోన్నతి పొందిన ఎంపీడీవో కు ఘనంగా సన్మానం

పదోన్నతి పొందిన ఎంపీడీవో కు ఘనంగా సన్మానం

ముద్ర.వీపనగండ్ల:- మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తూ మండల అభివృద్ధి అధికారి( ఎంపీడీవో )గా పదోన్నతి పొందిన శ్రీనివాస్ రావు ను కార్యాలయ సిబ్బంది శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. గత కొన్ని నెలల క్రితం బదిలీలో  భాగంగా మహేశ్వరం మండలం నుంచి వీపనగండ్ల మండల పంచాయతీ అధికారిగా నవంబర్ నెలలో బదిలీపై వచ్చి వీధుల్లో చేరారు, ఎంపీడీవో గా పని చేస్తున్న కథలప్ప పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా  నాగర్ కర్నూలు జిల్లాకు బదిలీపై వెళ్లారు.

మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రావు కు ప్రభుత్వం ఎంపీడీవో గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో శ్రీనివాసరావు ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీవో గా పదోన్నతి పొందిన శ్రీనివాస్ రావు కార్యాలయ సిబ్బంది ఉపాధి సిబ్బంది శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది శ్రీకాంత్, అమీర్, తిరుపతయ్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.