మన ఊరు మనబడి పనులల్లో వేగం పెంచాలి - ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

మన ఊరు మనబడి పనులల్లో వేగం పెంచాలి - ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

ముద్ర.వనపర్తి:- వనపర్తి నియోజకవర్గం పరిధిలో మన ఊరు మనబడి లో  చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అధికారుల ను ఆదేశించారు.మంగళవారం ఎమ్మెల్యే తన నివాసంలో అధికారులతో మాట్లాడారు.నిధులు మంజూరై ఉన్నా నిర్మాణాలలో జాప్యం ఎందుకు జరుగుతుందని ఆయన అధికారులను ప్రశ్నించారు.నిధులు మంజూరైన ప్రతి పనిని వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధి కోసం మంజూరు అయిన ఎస్ డి ఎఫ్  నిధుల సద్వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.ఈ సమీక్షలో ఈ డబ్ల్యూ ఏ డి సి, రాంచందర్, డిఈ శ్రీనివాసులు పాల్గొన్నారు.