కేతేపల్లి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

కేతేపల్లి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
  • డీకొన్న ఆర్టీసీ బస్సు, డీసీఎం
  • ఒకరు మృతి-పలువురికి గాయాలు

ముద్ర,పానుగల్ (ఆగస్టు 6): వనపర్తి జిల్లా పానుగల్ మండలం కేతేపల్లి గ్రామ సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీకొట్టుకోవడంతో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొల్లాపూర్ నుండి వనపర్తికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, వనపర్తి నుండి ఫర్టిలైజర్ లోడ్ తో తెళ్లరాలపల్లి కి వెళ్తున్న డీసీఎం కేతేపల్లి గ్రామ సమీపంలో బుడ్డ యేనే మలుపు దగ్గర ఢీ కొట్టుకోవడంతో డీసీఎం లో ఉన్న పదరా మండలానికి చెందిన డ్రైవర్ మహేష్(25) డ్రైవర్ సీట్ లోనే ఇరుక్కుపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. 

పోలీసులు జెసిబి సహాయంతో డీసీఎంలో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం వనపర్తి జిల్లా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. ఆర్టీసీ బస్సులో ఉన్న డ్రైవర్ తలకు గాయలు కాగా పలువురు ప్రయాణికులకు కూడా గాయాలు కావడంతో 108 ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇట్టి సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై వేణు తెలిపారు. బుడ్డ యేనే మలుపు దగ్గర గతంలో కూడా అనేక ప్రమాదాలు సంభవించి మృత్యువాత పడ్డ సంఘటనలు ఉన్నాయి.