గద్దర్ మరణం పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ దిగ్భ్రాంతి
![గద్దర్ మరణం పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ దిగ్భ్రాంతి](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64cfbad6ecf14.jpg)
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రజా గాయకుడు గద్దర్ మరణం పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తన గళంతో కోట్ల మంది ప్రజలను గద్దర్ ఉత్తేజపరిచారని, ఆయన మరణం బాధాకరమని అన్నారు. తన పాటలతో ప్రజలను చైతన్య పరిచారన్నారు గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ నివాళులు అర్పించారు.