ట్రస్మ జిల్లా అధ్యక్షుడికి పాత్రికేయులు సన్మానం 

ట్రస్మ జిల్లా అధ్యక్షుడికి పాత్రికేయులు సన్మానం 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్య సంఘం ట్రస్మ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన పాత్రికేయుడు బోయినిపెల్లి శ్రీధర్ రావును  జగిత్యాల పాత్రికేయులు సన్మానించారు. సూర్య గ్లోబల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాత్రికేయులు సన్మానించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ   జిల్లాలో ఉన్న జర్నలిస్టులందరికీ ప్రవేట్ పాఠశాలలో రాయితీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు బొడ్డుపల్లి అంజయ్య, బుర్ర సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల వేణుగోపాల్, గుగ్గిల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.