చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
![చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_6527bc1164c49.jpg)
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ అవినీతి కేసులో బెయిల్ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణను ఈ నెల 17వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఈ సందర్భంగా పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని కోర్టు ఆదేశించింది. గురువారం హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. కాగా, 33 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.