అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై స్పీచ్ హైలైట్స్

అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై స్పీచ్ హైలైట్స్

ముద్ర,హైదరాబాద్:- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

గవర్నర్ తమిళిసై స్పీచ్ హైలైట్స్:

  • ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వ పాలన సాగుతోంది. 
  • ప్రజలకు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం వచ్చింది.
  • ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. 
  • ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. దాన్ని చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
  • 6 గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేస్తున్నాం. 
  • అన్ని గ్యారెంటీలను నిర్ణీత సమయంలో అమలు చేస్తాం.
  • త్వరలో మరో రెండు గ్యారెంటీలను అమల్లోకి తెస్తాం. 
  • 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందిస్తాం. 
  • మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నాం. 
  • అర్హులకు రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. 
  • ప్రజాభవన్ ను ప్రజల కోసమే వినియోగిస్తున్నాం. 
  • 2 లక్షల ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించాం. 
  • చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ఆదుకుంటాం. ఎంఎస్ఎంఈకి కొత్త పాలసీ తీసుకొస్తాం.
  • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. 
  • దేశ ఏఐ క్యాపిటల్ గా హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తాం. 
  • టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నాం. 
  • గ్రీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తాం. కార్బర్ ఉద్గారాలను తగ్గిస్తాం. 
  • ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ అందిస్తాం. 
  • రాష్ట్రంలో 10 నుంచి 12 ఫార్మా విలేజ్ లు ఏర్పాటు చేస్తాం. 
  • రాష్ట్రానికి కొత్తగా రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
  • ప్రజలపై పన్నుల భారం పడకుండా చూస్తాం. 
  • గత అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశాం.