సివిల్ సర్వీసెస్ ర్యాంకర్  కి సన్మానం

సివిల్ సర్వీసెస్ ర్యాంకర్  కి సన్మానం

చిట్యాల ముద్ర న్యూస్: జాతీయ స్థాయిలో సివిల్ సర్వీస్ ఫలితాలలో 40 వ ర్యాంక్ సాధించిన చిట్యాల మండలం గుంటూరు పల్లి గ్రామానికి చెందిన రియల్టర్ శాఖమూరి అమర్ కుమారుడు సాయి హర్షిత్  ను తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరియు పి.ఆర్. టి .యు  జిల్లా ఉపాధ్యక్షులు కామిడి సతీష్ రెడ్డి,మరియు పి.ఆర్. టి.యు చిట్యాల మండలం అధ్యక్షులు పంచిక భగవాన్ రెడ్డి,డి.టి.ఫ్ జిల్లా నాయకులు కామిడి శ్రీధర్ రెడ్డి లు హనుమకొండ లోని అడ్వకేట్ కాలనీలో బొకే,శాలువాతో సన్మానించారు. సతీష్ రెడ్డి మాట్లాడుతూ  సివిల్ సర్వీస్ ఫలితాలలో సాయి హర్షిత్ అత్యుత్తమ ప్రతిభ చాటి చిట్యాల మండలం పేరు ను జాతీయ స్థాయిలో నిలిపారని,వారి నీ స్పూర్తి గా తీసుకుని విద్యార్థులు సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధం కావాలని అన్నారు.వారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కే గర్వ కారణం గా నిలిచారు.