టీయూడబ్ల్యూజే (ఐజేయు) మహాసభ ను విజయవంతం చేయాలి

టీయూడబ్ల్యూజే (ఐజేయు) మహాసభ ను విజయవంతం చేయాలి

ముద్ర,మరిపెడ: ఈనెల 13న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే  టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా  మహాసభను విజయవంతం చేయాలని మరిపెడ ఐజేయు జిల్లా ఉపాధ్యక్షుడు గంధసిరి రవి, మండల అధ్యక్షుడు  అక్తర్ పాషా పిలుపునిచ్చారు. మంగళవారం మున్సిపల్ కేంద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో   వారు మాట్లాడుతూ.. 13న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ద్వితీయ మహాసభ ను ఏర్పాటు చేస్తున్నామని, ఈ మహాసభకు రాష్ట్ర సీనియర్ జర్నలిస్టులు ( యూనియన్ నాయకులు) హాజరుతున్నట్లు తెలిపారు.మరిపెడ మండలంలోని సంఘానికి సంబంధించిన ప్రతి జర్నలిస్టు ఈ మహాసభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసంపాదకులు మహ్మద్ రియాజ్ పాషా,  జర్నలిస్టులు వంకాయలపాటి తిరుమల రావు, జిన్నా లచ్చయ్య, చంద్రశేఖర్, బోడ నాగేందర్,మచ్చ రాజేష్, మాలోత్ తిరుపతి,బోడ శీను తదితరులు ఉన్నారు.