రోడ్డు ప్రమాదంలో ఐజేయూ ఉపాధ్యక్షుడు ప్రభాకరన్ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఐజేయూ ఉపాధ్యక్షుడు ప్రభాకరన్ దుర్మరణం

ఐజేయూ నేతల ద్రిగ్భ్రాంతి

పాలక్కాడ్: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఉపాధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు ప్రభాకరన్ శనివారం రాత్రి 9:00 గంటలకు కేరళలోని పాలక్కాడ్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. టైమ్స్ ఆఫ్ ఇండియా స్పెషల్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్న ప్రభాకరన్ సుదీర్ఘకాలం ‘ది హిందూ’ దిన పత్రికలో వివిధ హోదాలలో పనిచేశారు. ప్రభాకరన్ మరణ వార్త పట్ల ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్ము,

మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, ఎస్ఎన్ సిన్హా, కార్యదర్శులు వై. నరేందర్ రెడ్డి, డి.సోమసుందర్, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అధ్యక్ష, కార్యదర్శులు నగునూరి శేఖర్, కే విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు కే సత్యనారాయణ, ఆలపాటి సురేష్ కుమార్, ఐజేయూ సీనియర్​ నాయకులు డి.కృష్ణారెడ్డి, కె.రామ్​నారాయణ, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఐవీ సుబ్బారావు, చందు జనార్ధన్ తదితరులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.  నిబద్ధతగల జర్నలిస్టు ఉద్యమ నేతగా ప్రభాకరన్ కేరళలో జర్నలిస్టుల సంక్షేమం కోసం, హక్కుల సాధన కోసం నిరంతర కృషి సాగించారని వారి పేర్కొన్నారు.