మన్ననూరు గిరిజన గురుకులం లో విద్యార్థులకు అస్వస్థత

మన్ననూరు గిరిజన గురుకులం లో విద్యార్థులకు అస్వస్థత

ముద్ర, అచ్చంపేట:-అమ్రాబాద్ మండలం మన్ననూరు గిరిజన బాలికల ఆశ్రమంలో మరో మారు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గత రెండు వారాల క్రితం దాదాపు 200 మంది బాలికలు అస్వస్థతకు గురై న విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిన విషయం తెల్సిందే. మరోమారు తాజాగా సోమవారం ఉదయం  మరో 15 మంది విద్యార్థులు వాంతులు, శ్వాసకు ఇబ్బందులు పడుతున్నారు.వారిని వెంటనే 108 ద్వారా అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరోమారు  విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో విద్యార్థుల తలిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యం పై సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వం ను డిమాండ్ చేస్తున్నారు.